ఎయిమ్స్ లో చేరిన లాలూ.. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు..

by  |
ఎయిమ్స్ లో చేరిన లాలూ.. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు..
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ కు తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అయితే అది సాధారణ జ్వరమే అని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మలేరియా, డెంగ్యూ లాంటి పరీక్షలు చేశామని వాటిలో పాజిటివ్ రావడంతో పర్యావేక్షణలో ఉంచామని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయన త్వరలోనే ఆరోగ్యంగా బయటకు వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story