లాల్​దర్వాజా బోనాలు ప్రారంభం..

by  |
లాల్​దర్వాజా బోనాలు ప్రారంభం..
X

దిశ, చార్మినార్​ : తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా, వేదమంత్రోచ్చారణలతో, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపధ్యం కలిగిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళిదేవాలయం, బంగారు మైసమ్మదేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్​ శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు.

ఉత్సవాలను ప్రారంభించిన సీపీ​ అంజనీకుమార్​ ..

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్​దర్వాజా శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన నగర పోలీస్ కమిషనర్​ అంజనీకుమార్​ 113 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్​ మాణిక్​ ప్రభు గౌడ్​ కుటుంబం తొలి బోనం సమర్పించింది. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్​ కె.వెంకటేష్​ కుటుంబసమేతంగా కలశ స్థాపన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట్​ ఎల్లమ్మ దేవాలయం ఇ ఓ అన్నపూర్ణ, చార్మినార్​ జోనల్​ జాయింట్​ సిపి డి.డి నాయక్​, ఉమ్మడి కమిటీ చైర్మన్​ బల్వంత్​ యాదవ్​, ఉపాధ్యక్షుడు కె.ఎస్ ఆనంద్​, ఆలయ కమిటీ ప్రతినిధులు కాశీనాథ్​, లక్ష్మీనారాయణగౌడ్​, బద్రీనాథ్​, రాజ్​కుమార్​, షీరా రాజ్​కుమార్​, మారుతీయాదవ్​, అరవింద్​కుమార్​గౌడ్​, చంద్రకుమార్​, విఠల్​, టిఆర్​ ఎస్​ నాయకుడు పోసాని సదానంద్​ ముదిరాజ్​ తదితరులు ఉన్నారు.

అక్కన్న మాదన్న వేడకులను ప్రారంభించిన మేయర్

హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాన్ని నగర మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు భగవాన్​ మహరాజ్​, రవినారాయణ ఆధ్వర్యంలో ధ్వజా రోహణ చేసిన మేయర్ విజయలక్ష్మి​ అక్కన్న మాదన్న మందిర 73వ బోనాల వార్షికోత్సవ వేడకులను లాంఛనంగా ప్రారంభించారు. ఆషాడమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రార్థనమందిరంలో సామూహిక కుంకుమార్చనలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించింది. అంతకుముందు అమ్మవారికి అభిషేకం, కలశస్థాపన పూజను చేతన్​కుమార్​ సూరి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జి.రాజరత్నం, ప్యాట్రన్​ జి.నిరంజన్​, కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్​కుమార్​, ప్రతినిధులు ఆవుల భరత్​ ప్రకాష్​, రాందేవ్​ అగర్వాల్​, ఎం.కృష్ణ, ఎస్​.పి క్రాంతికుమార్​, జి.శ్రీనివాస్​, ఎ.గోపాల్​, జి.రాజు, మహేష్​లు ఉన్నారు.

మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయంలో అంగరంగవైభవంగా బోనాల ఉత్సవాలు ప్రారంభం..
మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్​ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, అఖండ జ్యోతి, శతఛండీ సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్య హ వాచనం, రుత్వి గ్వర్ణనము, అంకురారోహణం, సర్వతో భద్ర మండపం, కలశ స్థాపన, ధ్వజా రోహణం, శ్రీ చక్ర అర్చన, ఛండీహోమం హారతి తదితరచ పూజా కార్యక్రమాలు జరిగాయి. బల్కంపేట్​ ఎల్లమ్మ దేవాలయం ఇఓ అన్నపూర్ణమ్మ, ఉమ్మడి కమిటీ ఉపాధ్యక్షుడు కె.ఎస్​ ఆనంద్​రావు, ప్రధాన కార్యదర్శి మధుసూధన్​ యాదవ్​, గాజుల రాహుల్​, తదితరులు పాల్గొన్నారు.

మహంకాళి 72 వ బోనాల వార్షికోత్సవాలు ప్రారంభం..

ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు జనగామ మధుసూధన్​గౌడ్​ ఆధ్వర్యంలో 72 వ బోనాల వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోపూజ, గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, ధ్వజా రోహణం, కలశస్థాపన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు బల్కంపేట్​ ఎల్లమ్మ దేవాలయం ఇఓ అన్నపూర్ణమ్మ, ప్రముఖ హిందూ ధర్మ వ్యాఖ్యాత చండీ ఉపాసకులు కొనగండ్ల రఘుశర్మ, ప్రతినిధులు కె.ఎస్​ ఆనంద్​, కీర్తి నరేందర్​ ముదిరాజ్​, సుభాష్​గౌడ్​, బాబురావు ముదిరాజ్​, సతీష్​గౌడ్​, శ్రీనివాస్​ ముదిరాజ్​, ప్రదీప్​గౌడ్​, గుర్నాథ్​ రెడ్డి, భవానీశంకర్​, ఆనంద్​ తదితరులు పాల్గొన్నారు.

గౌలిపురా శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో..

గౌలిపురా శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదర్లమహేష్​ ఆధ్వర్యంలో కుంభ అభిషేకం, గణపతి హోమం, నవగ్రహ పూజ, కలశస్థాపన పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు డొంకి యాదగిరి, ఇమేనియల్​, కె.దేవేందర్​, నరేష్​కుమార్​, బ్రహ్మానందం, దయానంద్, రవీందర్​ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed