- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వైరస్ మహమ్మారి ప్రజలను బలిగొంటున్నా.. సీఎం కేసీఆర్ జాడ లేడని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మి నారాయణ విమర్శించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పరీక్షలు నిర్వాహణ సరిగ్గా లేదని, ఉన్నవాటికి లెక్కలు కూడా లేవన్నారు. రాష్ర్టంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసే వరకూ పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కరోనాతో చనిపోయిన వారికి శ్రద్ధంజలి ఘటించారు. జిల్లాల్లో కోవిడ్ బులిటెన్ను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఐదువందల సంవత్సరాల ప్రజల కోరికను నరేంద్రమోడీ తీర్చారని అన్నారు. బీజేపీ పార్టీ అదిష్టానం ఆశీస్సులతో తనను రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీని రాష్ర్టంలో, జిల్లాలో బలోపేతం చేసేందుకు పాటుపడుతానన్నారు. ఇటీవల బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులుగా నియమించబడిన తరువాత జిల్లాకు వచ్చిన లక్ష్మి నారాయణకు పార్టీ నాయకులు స్వాగతం పలికి జిల్లా కార్యాలయంలో ఘన సన్మానం చేశారు.