ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

by  |
ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed