ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని [&hellip;]</p>

ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story