- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కార్తీక దీపారాధనలో అపశృతి చోటు చేసుకుంది. దేవాలయంలో కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో చోటు చేసుకుంది. వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చినరావూరులోని శివాలయంలో దీపాలు వెలిగించేందుకు వెళ్లింది.
కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ సుహాసిని చీరకు నిప్పు అంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే సుహాసిని 50 శాతం కాలిపోయింది. దీంతో స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్లో సుహాసిని చికిత్స పొందుతుంది.
Next Story