ఫలక్ నుమాలో దారుణం.. అర్ధనగ్నంగా లేడీ డ్యాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్..!

by  |
ఫలక్ నుమాలో దారుణం.. అర్ధనగ్నంగా లేడీ డ్యాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్..!
X

దిశ, చార్మినార్ : ఆర్‌కె స్ట్రా ట్రూప్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న మహిళ అర్థ నగ్నంగా అనుమాన స్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనా స్థలిలో బీర్ బాటిల్ లభ్యం కావడంతో పాటు, డ్యాన్సర్ గొంతుకు గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం..ఫలక్ నుమా ముస్తఫా నగర్‌కు చెందిన శరీన్ ఫాతిమా(30) నదీమ్‌లు భార్యాభర్తలు. వీరికి ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు కలరు. భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్ కె స్ట్రా ట్రూప్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి శరీన్ ఫాతిమానే పోషించుకునేది.

రెండు రోజుల కిందటే అద్దె ఇంటిని ఖాళీ చేసింది. మరోచోటుకు ఇంట్లోని వస్తువులు తరలించేందుకు తన పిల్లలను కాస్త దూరంలో ఉన్న నాని( నాయనమ్మ) ఇంటికి పంపించింది. డ్యాన్సర్ సామన్లు షిఫ్ట్ చేస్తూ పాత ఇంట్లోనే ఉండిపోయిన శరీన్ ఫాతిమా ఎంతకూ రాకపోవడంతో నాని ఇంటి నుంచి పిల్లలు తల్లి కోసం వచ్చారు. ఆ సమయంలో తల్లి అర్థ నగ్నంగా కదలకుండా పడిపోయి ఉంది. పిల్లలు ఏడుస్తూ వెళ్లి నానికి చెప్పారు. ఆమె స్థానికుల సహాయంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శరీన్ ఫాతిమా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినదని ఫలక్‌నుమా పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. శరీన్ ఫాతిమా మెడకు బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఘటనా స్థలిలో బీరు బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏడాదిన్నరలోపే తల్లి దండ్రులను కోల్పోయి ఏడుగురు పిల్లలు అనాధలయ్యారు. డ్యాన్సర్ ఫాతిమా హత్యకు గురయ్యారా? లేదా ఆత్మహత్యా..? అన్న కోణంలో ఫలక్ నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed