నాలాలో మహిళ మృతదేహం.. తాగి అందులో పడిపోయుంటదని పోలీసుల అనుమానం

by  |
Fathe-Nagar-Nala
X

దిశ, బేగంపేట: నాలాలో ఓ మహిళ శవమై తేలిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్ లోని శాస్త్రీనగర్ కు చెందిన భగీరథ లత(55) ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బుధవారం పైపైన్ రోడ్డు సమీపంలోని నాలాలో శవమై తేలుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భగీరథ లత భర్త రెండు నెలల కిందట మృతి చెందాడు. ఈమెకు కుమారుడు మధుసూదన్, కూతురు జోత్న్స ఉన్నారు. మద్యం తాగే అలవాటున్న లత అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి వస్తుండేదని.. ప్రమాదవశాత్తు నాలాలో పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story

Most Viewed