జీఎస్టీతో నడ్డి విరిచిన బీజేపీకి ఓటు ఎలా వేస్తారు: ఎల్.రమణ

by  |
జీఎస్టీతో నడ్డి విరిచిన బీజేపీకి ఓటు ఎలా వేస్తారు: ఎల్.రమణ
X

దిశ, హుజూరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేసి నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌ రమణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలన్నింటినీ ఎత్తివేస్తోందని, దీంతో నేతన్నలకు గడ్డుకాలం ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు రూ. వేల కోట్లు దోచిపెడుతోందని రమణ ఆరోపించారు. మన బతుకులను దుర్భరం చేసిన బీజేపీకి నేతన్నలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.



Next Story

Most Viewed