- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజిని అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story