రేవంత్‌పై ప్రభుత్వం కక్షగట్టింది

by  |
రేవంత్‌పై ప్రభుత్వం కక్షగట్టింది
X

దిశ, న్యూస్ బ్యూరో: మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్.సీ కుంతియా డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు పాశవిక పాలనకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలు, కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిని ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న రేవంత్‌రెడ్డి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేటీఆర్ నిర్మించుకున్న భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రకటించి నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

Tags: Kuntiya, congress incharge, press note, revanth reddy arrest

Next Story

Most Viewed