కుంభమేళాను మర్కజ్‌‌తో పోల్చవద్దు.. సీఎం కీలక వ్యాఖ్యలు

by  |
కుంభమేళాను మర్కజ్‌‌తో పోల్చవద్దు.. సీఎం కీలక వ్యాఖ్యలు
X

హరిద్వార్ : ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాను, నిజాముద్దీన్ మర్కజ్‌తో పోల్చవద్దని సీఎం తీరథ్ సింగ్ రావత్ అన్నారు. మర్కజ్ మూసి ఉన్న ఓ కట్టడంలోపల జరగ్గా కుంభమేళా విస్తారమైన బహిరంగ ఘాట్‌లల్లో జరుగుతుందని వివరించారు. మర్కజ్‌కు విదేశీయులూ వస్తారని, కానీ, కుంభమేళాలో మన దేశీయులే పాల్గొంటారని అన్నారు. అదిగాక, గతేడాది కరోనా తొలిసారిగా విజృంభిస్తు్న్నప్పుడు దాని నివారణ చర్యలపై అవగాహన లేదని, ఇప్పుడు వాటిపట్ల అవగాహన ఉన్నదని, మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. 12ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకార్యాన్ని అన్ని జాగ్రత్తలు పాటించి విజయవంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story

Most Viewed