సామాజిక బాధ్యతగా మొక్కలను రక్షించాలి

by  |
సామాజిక బాధ్యతగా మొక్కలను రక్షించాలి
X

దిశ, న్యూస్​బ్యూరో: నాటిన ప్రతి మొక్కను సామాజిక బాధ్యతగా అందరూ రక్షించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయగూడలోని జీహెచ్​ఎంసీ పార్క్​లో మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్​ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ బి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి క‌మిష‌న‌ర్‌ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ డిప్యూటి డైరెక్టర్ నాగిరెడ్డి, ఈ శ్రీనివాస్, సికింద్రాబాద్ తహశీల్దార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈచ్​ వన్..​ ప్లాంట్​ వన్​

పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ‘ఈచ్​ వన్..​ ప్లాంట్​ వన్​’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటిలో, వీధిలో పెంచుకోవాలని​ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఔటర్ రింగ్‌రోడ్డులోని దుండిగల్​ ఎగ్జిట్​– 5 వద్ద హెచ్ఎండీఏ నర్సరీ సమీపంలో మంత్రి కేటీఆర్​ మొక్కలు నాటారు. అనంతరం హెచ్ఎండీఏ రూపొందించిన ‘హరితహారం బ్రోచర్​’ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఔటర్​ రింగ్​ రోడ్డు పక్కన దుండిగల్ మున్సిపాలిటీ​ పరిధిలోని 110 ఎకరాల హెచ్ఎండిఏ స్థలంలో యాదాద్రి మోడల్​(మియావాకీ) పద్ధతిలో ​6.50 లక్షల మొక్కలను నాటి చిట్టడవిగా మార్చనున్నట్లు ప్రకటించారు. ఓఆర్ఆర్​ చుట్టు తిరిగి ప్రతి 10కిలోమీటర్లకు ఒక ‘థీమ్’ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దుండిగల్​ మున్సిపాలిటీ చైర్​పర్సన్ ​ఎస్​.కృష్ణవేణి కృష్ణ, నిజాంపేట్​ కార్పొరేషన్​ మేయర్​ కొలను నీలా గోపాల్​రెడ్డి, కొంపల్లి కార్పొరేషన్​ మేయర్​ ఎస్​. శ్రీశైలం యాదవ్​, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్​ కుమార్​, మేడ్చల్–​ మల్కాజ్​గిరి జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, హెచ్ఎండీఏ అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ బి.శ్రీనివాస్​, ఓఆర్ఆర్​ ప్రాజెక్టు డైరెక్టర్​ బి.ఎం.సంతోష్​, సెక్రెటరీ ఎం.రాంకిషన్​, చీఫ్​ ఇంజినీర్​ బి.ఎల్​.ఎన్​.రెడ్డి, ప్లానింగ్​ డైరెక్టర్లు బాలకృష్ణ, జి.నరేంద్ర, శివశరణప్ప, డిఎఫ్​వో ప్రకాశ్, డిప్యూటీ రేంజ్​ ఆఫీసర్​ బాపు​ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story