ఖమ్మం మేయర్‌‌ను అభినందించిన కేటీఆర్

by  |
KTR,-puvvada-ajay-kumar
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేయాలని తనంగా ఎన్నికైన మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాల‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. సోమ‌వారం హైదరాబాద్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నూతన మేయర్, ఉప మేయర్‌లు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. మంత్రి పువ్వాడ అజాయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం చాలా అభివృద్ధి చెందిందని, దానిని కొనసాగింపుగా మీ వంతు కృషి చేసి మరింత చేయాలన్నారు. మంత్రి పువ్వాడ వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజయ్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed