తప్పును ఒప్పుకున్న కేటీఆర్.. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించాలని ట్వీట్

by  |
KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించారని మంత్రి కేటీఆర్ 2 రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఇంకా పట్టుకోలేదని 48 గంటల తర్వాత ఆయన తెలుసుకున్నారు. తాజాగా మంగళవారం రాత్రి పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రూ.10 లక్షల రివార్డు ప్రకటించాక.. మంత్రి తన ఓల్డ్ ట్వీట్ సరిచేసుకున్నట్లు పోస్ట్ చేశారు. ట్వీట్ ప్రకారం “Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement, The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him, Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly” అని ఉంది. అంతేకాకుండా నిందితుడిని పట్టుకోవడంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ వెంటనే నిందితుడు రాజును పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed