కృనాల్ పాండ్యాకు కరోనా.. శ్రీలంక టూర్‌ ఖతమేనా.?

by  |
కృనాల్ పాండ్యాకు కరోనా.. శ్రీలంక టూర్‌ ఖతమేనా.?
X

దిశ, వెబ్‌డెస్క్: శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని.. టీ-20పై ఫోకస్ చేసిన భారత జట్టు ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టింది. తీరా రెండో టీ-20కి రెడీ అయిన సమయంలో కరోనా టెన్షన్ పెట్టింది. భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారీన పడ్డాడు. దీంతో అప్రమత్తమైన ఇరు జట్లు ఐసొలేషన్‌లోకి వెళ్లాయి. నేడు జరగాల్సిన రెండో టీ-20ని రేపటికి వాయిదా వేశారు. అయితే, రేపటి మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇదే సమయంలో కృనాల్ త్వరగా కోలుకోవాలంటూ ఓ వైపు క్రికెటర్లు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed