ఉప్పెన హీరోయిన్ చాలెంజ్

by  |
ఉప్పెన హీరోయిన్ చాలెంజ్
X

తెలుగు తెర కోరుకుంటున్న కొత్తదనం..టాలీవుడ్ ఆశిస్తున్న చురుకైన అందం..తనే అంటున్నారు కుర్రకారు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న కృతి శెట్టి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసేసింది. యూత్ వాల్ పేపర్, డీపీ‌ల్లో దర్శనం ఇస్తోంది. ఫస్ట్ మూవీ రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమా ఆఫర్లను కొట్టేసిన అమ్మడు.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది.

మైత్రీ మూవీ మేకర్స్ రవి చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన కృతి తనకు పువ్వులంటే ఇష్టమని..అందుకే మూడు పూల మొక్కలు నాటుతున్నట్లు తెలిపింది. ఉప్పెన చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం పాటను ఇష్టపడుతున్న అందరినీ..గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. మరి ఆ పాటను అందించిన మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా చాలెంజ్ విసరాలిగా.. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా నామినేట్ చేసింది.

కాగా, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన కృతికి పర్యావరణం పట్ల ఉన్న ప్రేమను మెచ్చుకుంటూనే… మొక్కలు నాటుతున్న కృతి అందాన్ని పొగిడేస్తున్నారు నెటిజన్లు. తెలుగు తెరను ఏలబోయేది తనే అంటూ.. మారి కొద్ది రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించడం ఖాయం అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.


Next Story

Most Viewed