‘అల వైకుంఠపురములో’ రీమేక్‌లో కృతి‌సనన్.. డేట్స్ సెట్ అయ్యేనా?

by  |
‘అల వైకుంఠపురములో’ రీమేక్‌లో కృతి‌సనన్.. డేట్స్ సెట్ అయ్యేనా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ ‘లూకా చిప్పి’ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కెమిస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఈ హిట్ పెయిర్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అల వైకుంఠపురములో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తుండగా ఇందులో కార్తీక్‌ను ఆల్రెడీ హీరోగా ఎంచుకున్నారు. ఇక కృతి డేట్స్ సెట్ చేస్తే మరోసారి ఈ కాంబినేషన్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోయినట్లే.

ఇప్పటికే కథ విన్న కృతి సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అదే టైంలో టైగర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న ‘గణపత్‌’కు కాల్‌షీట్స్ ఇప్పటికే ఇచ్చేసిందని బీ టౌన్ టాక్. జూన్ నుంచి ‘అల వైకుంఠపురములో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా, డేట్స్ సర్దుబాటు చేసే పనిలో ఉందట కృతి. ఏక్తాకపూర్, అల్లు అరవింద్, అమన్ గిల్, ఎస్ రాధా కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్నారు. కృతితో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను కూడా మేకర్స్ సంప్రదిస్తుండగా ఏప్రిల్‌లో లీడింగ్ లేడీని ఫైనల్ చేయనున్నారు.



Next Story