ఎన్ఆర్సీ కేవలం ముస్లీం సమస్య కాదు : కోటంరెడ్డి

by  |
ఎన్ఆర్సీ కేవలం ముస్లీం సమస్య కాదు : కోటంరెడ్డి
X

నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మట్లాడుతూ… రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు తీసుకొస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్ఆర్సీ కేవలం ముస్లీంల సమస్య కాదని దేశ ప్రజలందరి సమస్య అన్నారు. జీవో నెంబర్ 124 విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా కేరళ ప్రభుత్వం తరహాలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసనసభలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అందరి గొంతు వినిపిస్తానని తెలిపారు. ఎన్ఆర్సీ చట్టం దేశ ప్రజల దురదృష్టం అన్నారు.

Next Story

Most Viewed