సోషల్ మీడియాకు కొరటాల గుడ్‌బై

by  |
సోషల్ మీడియాకు కొరటాల గుడ్‌బై
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. తీసినవి తక్కువ సినిమాలే అయినా.. సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా నిలిచిన శివ.. కమర్షియల్ సినిమాల్లోనూ మెసేజ్‌ ఇవ్వడంలో దిట్ట. ఇక సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ఆయన తన చిత్రాల్లోనూ ఆ భావాలను ప్రదర్శిస్తుంటారు. కాగా తన సినిమా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేసే కొరటాల.. లేటెస్ట్ ట్వీట్‌లో సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతునట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్‌పై అనేక విషయాలను పంచుకున్నానని, కానీ ఇప్పుడు దూరం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అయితే మీడియా ఫ్రెండ్స్ ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటానని.. మీడియం చేంజ్ అయినా, బాండింగ్ మాత్రం మారదని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed