- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఆగస్ట్ నుంచి ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఉండబోతోంది. దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్న చిరు.. అవినీతిని ఎలా అడ్డుకున్నాడనేది సినిమా కథ. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఇంటెన్సివ్ రోల్లో కనిపించబోతున్నారు. స్టూడెంట్ లీడర్ లేదా నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
అయితే, ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం టెంపుల్ సెట్ వేయించాలని అనుకుంటున్నారట కొరటాల. దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరుపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఏదైనా పురాణ ఆలయంలో షూటింగ్ జరపాలని అనుకున్నా.. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా స్పెషల్ సెట్ వేయిస్తున్నారని తెలుస్తోంది.
Next Story