150 కోట్ల మొక్కలు నాటాం: కొప్పుల ఈశ్వర్

by  |
150 కోట్ల మొక్కలు నాటాం: కొప్పుల ఈశ్వర్
X

దిశ, కోరుట్ల: హరిత తెలంగాణ నిర్మాణమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాలలో హరితహారం సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో కేవలం 40 లక్షల మొక్కలు నాటితే, తెలంగాణ ప్రభుత్వం 150 కోట్లు నాటిందన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా రైతులు స్వచ్ఛందంగా తీర్మాణాలు చేయడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రిపై అపారమైన నమ్మకంతోనే నియంత్రిత సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed