- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నెలరోజుల క్రితం హట్టహాసంగా ప్రారంభమైన కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి పడింది. దీంతో వెంకటాపురం గ్రామాన్ని వరద ముంచెత్తింది. గ్రామంలోని పలు ఇళ్లలో మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. జగదేవ్పూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులను నింపడానికి కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు.
ఇదే సమయంలో భారీగా వర్షాలు పడటంతో కాల్వకు వరద పోటెత్తింది. దీంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో కాలువకు భారీ గండి పడింది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గండిని పూడ్చారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే.