బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్ పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by  |
Konda
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ప్రకటించారు. ఎప్పుడు చేరుతాననేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కొండా విశ్వేశ్వర్​రెడ్డితో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి టీపీసీసీ చీఫ్​ కావాలని తాను చాలా పోరాటం చేశానన్నారు. రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్​ కావడం సంతోషంగా ఉందని, తానే స్వయంగా కలుద్దామనుకున్నానని చెప్పారు. కానీ రేవంత్​ రావడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
అనంతరం టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్​లోకి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారని, ఐడియాలజీకి చేయలేదన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ భ్రష్టు పట్టిస్తున్నారని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని రేవంత్ విమర్శించారు. కానీ కేసీఆర్​ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని, అప్పు కోసం బ్యాంకులు, సంస్థల దగ్గరకు అవసరం లేదని, వాళ్లే ప్రభుత్వానికి అప్పు ఇవ్వవచ్చని రేవంత్​ ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed