‘జగన్‌ స్కీమ్‌ సూపర్.. కేసీఆర్ కూడా అమలు చేయాలి’

by  |
Komatireddy
X

దిశ, భువనగిరి రూరల్: నూత‌న రేష‌న్ కార్డులు ఇవ్వడంతో పాటు రేష‌న్ పంపిణీలో నూత‌న సంస్కర‌ణ‌లు తీసుకురావాల‌ని సీఎంకు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ‌లో రాష్ట్రంలో ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా వాటిని తీసుకోవ‌డంలో ప్రజ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయన తెలిపారు. 6 కిలోల బియ్యం తీసుకోవ‌డానికి రవాణాతో క‌లిపి 20 రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తుంద‌ని వివ‌రించారు. కాబ‌ట్టి ఏపీలో చేపట్టిన ఇంటింటికి రేష‌న్ బియ్యం పంపిణీ విజ‌య‌వంతం అయ్యింద‌ని గుర్తు చేశారు. దానిని మోడ‌ల్‌గా తీసుకుని ఇంటింటికి రేష‌న్ స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. సివిల్ స‌ప్లై శాఖ వాలంటీర్లను నియ‌మించి ఇంటింటికి రేష‌న్ స‌రుకులు పంపిణీ చేస్తే రేష‌న్ కార్డుదారుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed