ఒక్కటైన కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి.. రాజ్‌భవన్ వద్ద రహస్య చర్చ

by  |
Komatireddy Venkat Reddy, revanth reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ టీపీసీసీ పోటీ మొదలైంది. మరో వారం రోజుల్లో టీపీసీసీ చీఫ్ ఎంపికపై క్లారిటీ రానున్న క్రమంలో కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకున్న స్నేహంపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శుక్రవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా.. తమ మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేదని తేల్చేశారు. కాగా, అంతకముందు ఇరువురు రాజ్‌భవన్ వద్ద ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని, త్వరలోనే ఎవరో ఒకరు టీపీసీసీ చీఫ్‌గా ఎన్నిక కావడం ఖాయం అని భావించిన పరిస్థితుల్లో ఇరువురు రహస్యంగా మాట్లాడుకొని, తామిద్దరం ఒకటే అని తేల్చేయడం మరో చర్చకు దారితీస్తోంది.

Next Story

Most Viewed