- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు కరోనా ఎవరిని వదలడం లేదు. ఇప్పటీకే చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. కోలీవుడ్ హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెరెమియాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ” ప్రియమైన అందరికి, గత వారం నేను కోవిడ్ -19 పరీక్షచేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పటికీ నేను క్వారంటైన్ లోనే ఉన్నాను. కానీ కోలుకున్నా.. నన్ను జాగ్రత్తగా చూసుకున్న నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అందరు జాగ్రత్తగా ఉండండి ” అంటూ పోస్ట్ చేసింది. ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆండ్రియా.. తాజాగా ఇలయదళపతి విజయ్ ‘మాస్టర్’ చిత్రంలోనూ అలరించారు.ఆండ్రియా కరోనా బారిన పడిన సంగతి తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.