టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

by  |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14 గత నాలుగు రోజులుగా అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. నిన్నటితోనే అన్ని జట్లు మైదానంలోకి దిగి శక్తి, సామర్థ్యాలను నిరూపించుకున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆనవాయితీ అంటూ.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కొట్టింది. మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ చేజేతులారా మ్యాచ్‌ను వదులుకుంది. ఈ మూడు మ్యాచులు ఒక ఎత్తు అయితే.. సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఐపీఎల్ వైభవాన్ని గుర్తు చేసింది. వరుస బౌండరీలు.. భారీ షాట్‌లతో ఉర్రూతలూగించింది.

ఇది ఇలా ఉంటే మరి కాసేపట్లో ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఐదో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ముంబై ఓడిపోగా.. కోల్‌కతా SRHపై గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో రెండో మ్యాచ్‌పై గెలిచేందుకు ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా నైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌కు దిగే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed