కోహ్లీకి ఫిదా అయిన పాక్ మహిళా కెప్టెన్

by  |
కోహ్లీకి ఫిదా అయిన పాక్ మహిళా కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయి. ఇక టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియాకి ఫస్ట్ మ్యాచ్ లోనే దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. అయితే, లేటెస్ట్‌గా పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పాక్‌తో ఓడిపోయిన తర్వాత కోహ్లీ చూపించిన క్రీడా స్ఫూర్తికి సనా మీర్ ఫిదా అయింది. పూర్తి క్రీడాస్ఫూర్తితో ఓటమిని అంగీకరించిన విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్ చెప్పింది. పాక్‌తో ఓటమి తర్వాత ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్న విషయాన్ని సనా ప్రస్తావిస్తూ.. విరాట్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

విరాట్ కోహ్లీ ఓటమిని కూడా ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుంటున్నాడని, ఓ టాప్ ప్లేయర్ ఇలా చేయడం హర్షించదగ్గ విషయమని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, విరాట్ కోహ్లీ చేసిన పని అతని కాన్ఫిడెన్స్‌ను సూచిస్తోందని.. నెక్ట్స్ మ్యాచ్‌లో కచ్చితంగా గెలుపు సాధిస్తామన్న ధీమా కోహ్లీ కళ్లల్లో కనబడిందని ఆమె తెలిపారు. ఇక ఈ ఓటమి తర్వాత టీమిండియా భారీ విజయంతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపడం ఖాయమని అలాగే, ఫైనల్ లో మరోసారి భారత్, పాక్ జట్లు తలపడతాయని సనా మీర్ ఆశాభవం వ్యక్తం చేశారు.

Next Story