- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, గజ్వేల్: దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనడాలని, దళితులపై దాడులు, భూమి గుంచుకోవడం వంటి చర్యలను మానుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన నర్సింహులు కుటుంబీకులను ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని మండిపడ్డారు. బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని, దళితులకు మూడెకరాల భూమి ఇయ్యకపోగా ఉన్నది గుంజుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. భూమికి భూమి ఇయ్యమని నర్సింహులు వేడుకున్నా వినకుండా భూమిని లాక్కోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన అంత్యక్రియలకు కూడా పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఇలా మీద పడి గుంజుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.