రిక్వెస్ట్ చేసిన కొడంగల్ ఎమ్మెల్యే.. ఓకే చెప్పిన హరీశ్‌రావు

by  |
harishrao-1
X

దిశ, దౌల్తాబాద్: మంత్రి హరీశ్ రావును గురువారం కొడంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కలిసి తన నియోజకవర్గంలోని బాలంపేట్, దుద్యల్, భూనిడ్ హుస్నాబాద్, రుద్రారం గ్రామ పంచాయతీలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని మంత్రిని కోరాడు. ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్ కూడా మంత్రిని కలిసి హెల్త్ సెంటర్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని, త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.


Next Story