వైద్య నిపుణులతో కమిటీ వేయాలి

by  |
వైద్య నిపుణులతో కమిటీ వేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణ చర్యలపై వైద్య నిపుణులతో కమిటీ వేయాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూడాలు, ప్రజలు పోట్లాడుకునే దౌర్భాగ్యమైన పరిస్థతి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో వైద్యరంగ నిపుణులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ. రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకు ఒక గాంధీ ఆసుపత్రి ఎలా సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లో ప్రతి కాలేజీలో 600 పడకలు ఉండాలి, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. అట్టహాసంగా ప్రకటించిన గచ్చిబౌలి టీమ్స్‌లో ఒక డాక్టర్ కూడా లేరని ఎద్దేవా చేశారు. సీఎంకు వాస్తవాలు తెలియాలంటే జూనియర్ డాక్టర్లు, పీజీలు, సూపరింటెండెంట్, ఇతర వైద్య నిపుణులతో కమిటీ వేయాలని సూచించారు. వివరాలు తెప్పించుకోని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ వైద్యరంగ నిపుణులు డా.సంజీవ్ సింగ్‌ యాదవ్, డా. వెంకటరత్నం, డా. నందకుమార్‌రెడ్డి, డా. ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed