ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు మంత్రి కొడాలి!

by  |
ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు మంత్రి కొడాలి!
X

దిశ,వెబ్ డెస్క్: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లేందుకు మంత్రి కొడాలి నాని సిద్దమవుతున్నారు. ఈ నెల 21 వరకు మీడియా ముందు, సమావేశాల్లో మాట్లాడొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలపై ఆదేశాలను కోర్టులో సవాల్ చేయాలని మంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ఆయన సిద్దం అయ్యారు. కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

కాగా ఎస్ఈసీపై మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్ అయింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రికి ఎస్ఈసీ శుక్రవారం షోకాస్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మంత్రి ఆ వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. అయితే మంత్రి వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో మంత్రి ఈ నెల 21వరకు మీడియా ముందు మాట్లాడకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed