మా పాలన చూసి ఆయనకు నిద్ర పట్టడం లేదు..

by  |
మా పాలన చూసి ఆయనకు నిద్ర పట్టడం లేదు..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సంక్షేమ పాలన చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను నిర్వహించారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీ డబ్బును కూడా టీడీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి వారు అడ్డుకుంటున్నారని తెలిపారు.

Next Story

Most Viewed