వెల్లంప‌ల్లికి మంత్రులు ప‌రామ‌ర్శ‌

by  |
వెల్లంప‌ల్లికి మంత్రులు ప‌రామ‌ర్శ‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఏపీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవ‌ల‌ వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో విజ‌య‌వాడ‌లోని బ్ర‌హ్మ‌ణ‌వీధిలోని వెల్లంప‌ల్లి ఇంటికి వెళ్లిన మంత్రులు.. సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంత‌రం కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. అటు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కూడా వెల్లంప‌ల్లిని ప‌రామ‌ర్శించారు.

Next Story

Most Viewed