- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పాలేరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన కాన్వాయ్లో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే చికిత్స అందే విధంగా చర్యలు తీసుకొని మానవత్వం చాటుకున్నారు. నేలకొండపల్లి మండలం మూటాపురం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మూటాపురం ఎంపీటీసీ జర్పుల బాలాజీ మోటార్ సైకిల్ స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయాడు. దీనితో తీవ్ర గాయాలకు గురయ్యారు. అదే సమయంలో మూటాపురం వీరన్న స్వామి దర్శనం చేసుకుని దారిలోనే వెళ్తున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే కారును ఆపారు. తన సిబ్బంది సహకారంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలాజీని తన కారులో స్వయంగా తీసుకెళ్లి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాలాజీకి మంచి చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని బాలాజీ కుటుంబ సభ్యులకు అందించారు. ప్రస్తుతం బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకి బాధిత ఎంపీటీసీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.