- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్కు బంపర్ ఆఫర్. సౌతాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్కు కెప్టెన్గా రాహుల్ బాధ్యతలు వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వన్డే సిరీస్కు ప్రారంభం నాటికి రోహిత్ కోలుకోవడంపై సందిగ్ధత నెలకొంది.
ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో బీసీసీఐ.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం నుంచి కోలుకోపోతే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 19 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్తో సెంచరీ బాదిన విషయం తెలిసిందే.