- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది కేవలం దానికోసమే.. కిషన్రెడ్డి సంచలన కామెంట్స్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కు వెళ్లింది ఆయన భార్య హెల్త్చెకప్కోసమేనని వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష అనంతరం గురువారం కిషన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, తన సహకారం అడగలేదని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతాం, అగ్గి పెడతా అని ఢిల్లీకి వెళ్లికి సీఎం బీజేపీని ప్రశ్నించేందుకు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కు వెళ్లింది ఆయన భార్య హెల్త్చెకప్కోసమేనని వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష అనంతరం గురువారం కిషన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, తన సహకారం అడగలేదని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతాం, అగ్గి పెడతా అని ఢిల్లీకి వెళ్లికి సీఎం బీజేపీని ప్రశ్నించేందుకు ఏమీ లేక తన సొంత పనులు మాత్రమే చూసుకొని వచ్చారని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు ఆ పథకాలకు ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. రాష్ట్ర అధికారులు మోడీ ఫోటో పెట్టకపోవడానికి కారణం రాజకీయ ఒత్తిళ్లేనని తను భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ప్రభుత్వం ఉండేది మరో రెండేళ్లేనని, తర్వాత రాబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది నిజం కాదా చెప్పాలని కిషన్రెడ్డి ప్రశ్నించారు.






