అమిత్ షా రాక నేపథ్యంలో.. తమిళ సీఎంతో కిషన్ రెడ్డి కీలక భేటీ

by  |
అమిత్ షా రాక నేపథ్యంలో.. తమిళ సీఎంతో కిషన్ రెడ్డి కీలక భేటీ
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై వారితో కిషన్ రెడ్డి చర్చించారు. 50 స్థానాలను కేటాయించాలని బీజేపీ కోరినట్టు సమాచారం. కొంగు మండల ప్రాంతంలో అధిక సీట్లను బీజేపీ కోరింది. కాగా ఆదివారం తమిళనాడులో హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీట్ల పంపకంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రానున్నారు. సీట్ల పంపకంపై రేపు అమిత్ షాతో సమావేశంలో తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎం ఫైనల్ డిసీజన్ తీసుకునే అవకాశం ఉంది.

Next Story

Most Viewed