అలా చేయకుంటే టీఆర్ఎస్‌కు సింగిల్ డిజిట్ వచ్చేది: కిషన్‌రెడ్డి

by  |
అలా చేయకుంటే టీఆర్ఎస్‌కు సింగిల్ డిజిట్ వచ్చేది: కిషన్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మజ్లిస్‌తో ఫ్రెండ్‌షిప్ లేకుంటే సింగిల్ డిజిట్ వచ్చేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మజ్లిస్‌తో టీఆర్ఎస్ అక్రమ పొత్తు పెట్టుకుందన్న కిషన్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్నారు. ఓట్ల కోసం రూ.10వేలు సాయం చేసి మధ్యలోనే ఆపేశారని, ఇప్పటికీ చాలామందికి వరద సాయం అందలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో రాష్ట్ర ముఖచిత్రం మారిపోయిందన్నారు. వచ్చే రెండేళ్లు బీజేపీకి చాలా కీలకం అన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యకర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.



Next Story