సర్కార్‌పై ఆగ్రహం.. ఉరి తాళ్లతో కిసాన్ మోర్చా నిరసన

by  |
సర్కార్‌పై ఆగ్రహం.. ఉరి తాళ్లతో కిసాన్ మోర్చా నిరసన
X

దిశ, హుజురాబాద్ రూరల్ : కేంద్రం కొంటున్నా వరిని సాగు చేయవద్దు అనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు.? అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ హమీ నుండి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో వరిసాగు వద్దని చెప్తున్నారన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా కలెక్టర్లు మాట్లాడటం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరిని వద్దనడం సరికాదన్నారు.

Next Story

Most Viewed