మ్యాచ్ మాదే అనుకున్నాం : రాహుల్

by  |
మ్యాచ్ మాదే అనుకున్నాం : రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 224 భారీ లక్ష్యాన్ని చేధించి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ ఆదివారం షార్జా వేదికగా ఆదివారం జరిగింది. అనంతరం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ… ‘క్రికెట్‌లో ఇదొక మంచి రోజు. ఇలాంటి మ్యాచ్‌లు గత కొన్ని ఏళ్లుగా మనం చూస్తున్నాం. కానీ తొలి సారిగా ఐపీఎల్‌లో చూడటం సంతోషం. అయితే ఈ మ్యాచ్ ద్వారా చాలా నేర్చుకున్నాము. నిజం చెప్పాలంటే భారీ స్కోర్ చేశాక ఇక మ్యాచ్ మాదే అని అనుకున్నాం. కానీ రాజస్థాన్ జట్టు అద్భుతం చేసింది. ఇదొక బ్యాడ్ గేమ్ అనుకుంటాము. రాబోయే మ్యాచ్‌లలో మా తప్పులు సరిదిద్దుకుంటాం.’ అని రాహుల్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed