దారుణం.. తొమ్మిదేళ్ల బాలుడిని చంపేసిన కిడ్నాపర్లు

by  |
Murder
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంగలాయపల్లెకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు తనీష్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి డబ్బులు సమకూర్చుకునే లోపే చిన్నారిని చంపేశారు. గ్రామంలోని అంకాలమ్మ గుడి సమీపంలో బాలుడి గొంతుకోసం కిరాతకంగా హత్య చేశారు. క్షుద్ర పూజల కోసమే బాలుడిని చంపేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.



Next Story

Most Viewed