- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బాలీవుడ్ భామ కియారా అద్వానీ లాక్డౌన్లోనూ పలు చిత్రాల్లో నటిచింది. ఈ క్రమంలోనే తను లీడ్ రోల్లో నటించింది ‘ఇందూ కీ జవానీ’ ఈ మధ్యే రిలీజైన విషయం తెలిసిందే. కాగా ఈ భామ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో ప్రేమాయణం నడుపుతోందన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల సిద్ధార్థ్.. కియార పేరెంట్స్ను కలిశాడని, వీరిద్దరూ త్వరలోనే మ్యారేజ్ చేసుకుంటారని ఊహాగానాలొస్తుండగా.. వీటిపై చిట్ చాట్లో స్పందించారు కియార.
తాను సింగిల్గానే ఉన్నానని, ఆ వార్తలేవీ నమ్మొద్దని చెప్పింది. సిద్ధార్థ్ మల్హోత్ర బర్త్ డే సందర్భంగా విష్ చేయడానికి వెళ్లినప్పటి ఫొటోలను కొందరు షేర్ చేస్తున్నారని తెలిపింది. ఇక తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఇందూ కీ జవానీ’ గురించి మాట్లాడిన కియార.. డేటింగ్ యాప్స్ వల్ల కలిగే లాభనష్టాల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు వివరించింది. తన దృష్టిలో సక్సెస్ అంటే కంటిన్యూయస్ జర్నీ అని.. ఒక్క విజయంతో సంతృప్తి చెంది అక్కడే ఆగిపోతే జీవితంలోని పరిపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించలేమని చెప్పింది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటానని కియార పేర్కొంది.