ఒక్కదాన్నే ఎంతమందినని సంతోషపెట్టగలను- కియారా

by  |
ఒక్కదాన్నే ఎంతమందినని సంతోషపెట్టగలను- కియారా
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ కియారా అద్వానీ.. నెటిజన్లు తనను అహంకారిగా పిలవడంపై స్పందించింది. సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘పించ్ సీజన్ 2’ లేటేస్ట్ ఎపిసోడ్‌లో కనిపించిన భామ.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య ఒక ఈవెంట్‌కు హాజరై కియారా ఫొటోగ్రాఫర్లకు పోజివ్వకుండా హర్రీగా వెళ్లిపోయినప్పటి నుంచి తనపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై రియాక్ట్ అయిన కబీర్ సింగ్ హీరోయిన్.. “నిజానికి నేను ఒక సెకన్ నిలబడి ఫొటోలకు పోజిచ్చాను. వారికి షాట్ కూడా వచ్చింది. కానీ నాకోసం వేరొకరు ఎదురుచూస్తుండటంతో ఆలస్యమవుతుందని భావించి వెళ్లాను. దీంతో కామెంట్ సెక్షన్‌లో, నేను అహంకారిని అంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. కానీ మీరు చూసేదంతా నిజం కాదు. ఎవరైనా సరే అందరినీ సంతోషపెట్టలేరు. ప్రతీ ఒక్కరి పర్సనల్ స్పేస్‌ను గౌరవిద్దాం. అంతేగానీ ఎవరికి నచ్చినట్టు వారు ఊహించుకోకూడదు” అని తెలిపింది.

ఇక 2020లో ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ కోసం కియారా.. పెద్ద ఆకు వెనక టాప్‌లెస్‌ ఫొటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ యూజర్.. ‘2020లో ఇదొక్కటే మంచి విషయం’ అని చేసిన కామెంట్‌‌ను అర్బాజ్ చదివి వినిపించగా.. దీన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటానని చెప్పింది. కాగా రీసెంట్‌గా ‘షేర్‌షా’ మూవీలో కనిపించిన కియారా.. శంకర్-రాంచరణ్ అప్‌ కమింగ్ మూవీలోనూ ఎంపికైంది.



Next Story

Most Viewed