- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కియారా అద్వానీకి ముంబై ఎయిర్పోర్టులో వింత అనుభవం ఎదురైంది. తన రీసెంట్ ఫిల్మ్ ‘షేర్షా’ ట్రైలర్ రిలీజ్ కోసం కార్గిల్కు బయలుదేరిన నటిని ఎయిర్పోర్టు సిబ్బంది గుర్తుపట్టలేదు. ఫ్లైట్ జర్నీలో భాగంగా ఎవరైనా సరే, ముందుగా ఎయిర్పోర్టులో తమ ఐడెంటిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫేస్ మాస్క్ ధరించిన కియారాను గుర్తుపట్టని సీఐఎస్ఎఫ్ అఫిషియల్.. ఎంట్రీ చెక్ దగ్గర మాస్క్ తొలగించాల్సిందిగా కోరాడు. కియారా సబ్మిట్ చేసిన ఐడీ ప్రూఫ్తో సరిపోల్చుకునేందుకే మాస్క్ తీయమని సూచించగా తను అలాగే చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం కియారా నటించిన ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ మూవీ సీన్ గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఎంఎస్ ధోనిని గుర్తుపట్టని కియారా తనను హోటల్ రూమ్లోకి అనుమతించదు.
ఈ వీడియోపై నెటిజన్లు ఒక్కోరీతిన స్పందిస్తుండగా.. సీఐఎస్ఎఫ్ అఫిషియల్ ఎంఎస్ ధోని నుంచే నేర్చుకున్నాడని ఒకరు యూజర్ ట్వీట్ చేశారు. ఇక మరో యూజర్ ‘సినిమాలో తను ధోనితో వ్యవహరించినట్లుగానే ఇప్పుడు ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రవర్తించారు. ఇదే కర్మ ఫలితం’ అని కామెంట్ చేశాడు.