బ్యాక్‌గ్రౌం‌డ్ ఉంటే సరిపోదు : కియారా

by  |
బ్యాక్‌గ్రౌం‌డ్ ఉంటే సరిపోదు : కియారా
X

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చాలా తక్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా.. వెంటనే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘గుడ్ న్యూస్’ సినిమా చేసింది. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ప్రస్తుతానికి ‘లక్ష్మీ బాంబ్’ సినిమాతో ఓటీటీలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

అయితే, చాలా షార్ట్ పీరియడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడం అనేది మన పనితనం, అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్తోంది కియారా. అంతేకానీ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటి హెల్ప్ చేయలేదని నమ్ముతున్నానని తెలిపింది. టాలెంట్ ఉంటేనే ఆఫర్స్ వస్తాయి తప్ప.. బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాన్స్‌లు వస్తాయనేది నిజం కాదంటోంది. సయిద్ జాఫ్రీ, అశోక్ కుమార్ లాంటి ప్రముఖులు తన ఫ్యామిలీలో ఉన్నా.. తాను నటించిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కడం వల్లే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని చెప్తోంది. కబీర్ సింగ్, గుడ్ న్యూస్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఒకేసారి దక్కడం అదృష్టమని.. అవి తన కెరియర్‌కు చాలా ప్లస్ అయ్యాయని తెలిపింది. కరణ్ జోహార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ కొంచెం స్పెషల్ అని వెల్లడించింది.

Next Story