కియాలో కార్ల ఉత్పత్తి ప్రారంభం

by  |
కియాలో కార్ల ఉత్పత్తి ప్రారంభం
X

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తుండటంతో పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియాలో ఉత్పత్తి ప్రారంభమైందని పరిశ్రమ పీఆర్‌వో రమేష్ తెలిపారు. ప్రస్తుతం 700 మంది సిబ్బందితో ఈ నెల 7 నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రమేష్ పేర్కొన్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా 42 రోజుల పాటు కియా కార్ల పరిశ్రమ మూతపడింది.



Next Story

Most Viewed