కరోనా కలవరం.. ఖుష్బూ ఇంట విషాదం

by  |
కరోనా కలవరం.. ఖుష్బూ ఇంట విషాదం
X

కరోనా వైరస్ సోకి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చనిపోయారు. తాజాగా ఈ వైరస్ కారణంగా ప్రముఖ సినీ నటి ఖష్బూ ఇంట విషాదం చోటు చేసుకుంది. ముంబైలో ఉంటున్న ఖుష్బూ మరదలు ఇటీవలే కరోనా వైరస్ బారినపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతి చెందటంతో ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 62 వేలకు పైగా కరోనా బాధితులుండగా వారిలో రెండువేల మందికి పైగా మృతి చెందారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలించడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీరోజు వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ కావడంతో.. ప్రపంచంలో కొవిడ్ కేసుల పరంగా భారత్ ఏడో స్థానంలో నిలిచింది.

Next Story

Most Viewed