మరోసారి ఆలోచించండి : ఖుష్బూ

by  |
మరోసారి ఆలోచించండి : ఖుష్బూ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో సినిమా థియేట‌ర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ కోరారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా కోలీవుడ్ పరిశ్రమ పూర్తిగా నష్టపోయిందని అన్నారు. వైన్సులు, బార్లకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కానీ, థియేటర్లకు మాత్రం పూర్తిగా అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ కోలుకునేందుకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.


Next Story

Most Viewed