కరోనాకి ఖజానా విరాళం 4 కోట్లు

by Vemula.Srinu Prasad |

<p>దిశ ఏపీ బ్యూరో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరుకు మద్దతుగా ప్రముఖ నగల విక్రయ సంస్థ ఖజనా జ్యుయలరీ తన వంతు సాయాన్ని ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఖజానా జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కిషోర్‌ జైన్, డైరెక్టర్‌ అంకిత్‌ జైన్‌ 4 కోట్ల రూపాయల చెక్‌ను అందజేశారు. కాగా [&hellip;]</p>

కరోనాకి ఖజానా విరాళం 4 కోట్లు
X

దిశ ఏపీ బ్యూరో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరుకు మద్దతుగా ప్రముఖ నగల విక్రయ సంస్థ ఖజనా జ్యుయలరీ తన వంతు సాయాన్ని ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఖజానా జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కిషోర్‌ జైన్, డైరెక్టర్‌ అంకిత్‌ జైన్‌ 4 కోట్ల రూపాయల చెక్‌ను అందజేశారు. కాగా ఏప్రిల్ నెలలో రూ. 10 కోట్ల మొత్తాన్ని తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధికి అందజేస్తామని ఈ సంస్థ ప్రకటించింది.

Next Story